మహబూబ్నగర్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత నవీన్కుమార్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవి,
మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు అభినందించారు. ఇటీవల మహబూబ్నగర్ శాసనమండలి ఉపఎన్నికల్లో నవీన్కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై భారీ మెజార్జీతో గెలుపొందారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నవీన్కుమార్రెడ్డి సతీమణి లక్ష్మి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తనను ఎమ్మెల్సీగా గెలిపించిన పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు.