దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), జూన్ 27 : ధరణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం చిన్నచింతకుంట మండలంలో రెవెన్యూ కా ర్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బాగాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తాసీల్దార్ కార్యాలయంలో ధరణిలో పెండింగ్లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయని ఆరా తీశారు. రెండు దరకాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో గృ హజ్యోతి ఆన్లైన్ నమోదును పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు ఎలా ఉన్నాయని అ డిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అం దించాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యాబోదన, అలాగే భోజన వసతి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫర్టిలైజర్ దు కాణాల్లో రికార్డులను తనిఖీ చేసి ధరల పట్టిక, స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయ అధికారి యశ్వంత్రావు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, జూన్ 27: జూలై మొ దటి వారం వజ్రోత్సవ వన మహోత్సవం ద్వారా ప్ర భుత్వం నిర్ణయం మేరకు మొక్కలు నాటే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాల ని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో పార్క్లో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావే శం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వజ్రోత్సవ వన మ హోత్సవం కార్యక్రమంలో 30లక్షల 87వేల మొ క్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో జీపీ నర్సరీలు 441, అటవీశాఖ నర్సరీలు 9, మున్సిపాలిటీల్లోని 6 నర్సరీల్లో మొక్కలు ఉన్నాయని సం బంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్ర భుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యం ప్రకారం జూలై మొదటివారంలో నిర్వహించే వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేయాల ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్వో స త్యనారాయణ, డీఆర్డీవో నర్సింహులు, వ్యవసా య శాఖ అధికారి వెంకటేశ్ పాల్గ్గొన్నారు.