జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జూరాల ఆడియోస్ లింక్ కాల్వకు నీరందక ప్రతి ఏడాది పంటలు నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారుల అలసత్వానికి నిలువుటద్దం ఈ గండ్లు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలుగా కర్షకులకు కష్టాలు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.