బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా చేసిన రైతులు నేడు నాణ్యమైన కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాకముందు పడిన ఇబ్బందులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా పొలాల వద్దనే ఉండి పంటకు నీరు పారించేవారు. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురవక అన్నదాత ఆకాశం వైపు చూసే రోజులొచ్చాయి. ‘కేసీఆర్ హయాంలోనే కరెంట్ బాగుండే. గాలొచ్చినా, వానొచ్చినా పరిస్థితిని బట్టి కరెంట్ తీసెటోళ్లు.. ముచ్చటగా మూడు పంటలు సాగు చేసేటోళ్లం.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిం ది. మళ్లీ వలసలు పోవాల్సి వస్తుందేమో’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏ రచ్చకట్ట వద్ద చూసినా కరెంట్ ముచ్చటే వినిపిస్తున్నది. అయితే నాణ్యత లేని విద్యుత్ సరఫరాతో కొన్ని చోట్ల మోటర్లు కాలిపోతుండగా.. వాటిని బాగుచేసి చెప్పిన సమయానికి రైతులకు ఇవ్వలేకపోతున్నామని మెకానిక్లు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరంతర విద్యుత్ సరఫరాతో రైతు మోములో ఆనందం నింపిన కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానించడం సరైందికాదని రైతులు సూచిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. పాలన చేతగాకే రేవంత్ సర్కారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడితున్నారు..
– మహబూబ్నగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ హయాంలో పదేండ్లు కరెం ట్ ఫుల్లుగా ఇచ్చేది. ఎప్పుడైనా సేనుకు పోయి బోర్లు వేసుకుని పంటలు పండించుకునేటోళ్లం. పదేండ్లపాటు 24 గంటల కరెంట్ ఇచ్చిన్రు. ఇష్టం వ చ్చిన పంటలు పండించేది. 2014 కం టే ముందు కరెంట్ కోసం ఎంత తం డ్లాడామో ఇప్పుటికీ గుర్తున్నది. కరెంట్ ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పో తుండెనో తెలియని పరిస్థితి. రాత్రిళ్లు మోటర్లకాడనే పడుకుని ఇబ్బందులు పడినం. కేసీఆర్ సార్ వచ్చినంక కరెం ట్ రంది లేకుండా గడిపినం. ఇప్పుడేమో మళ్లీ పాతరోజులొస్తాయ ని భయమైతుంది. వానకాలం సాగు చేద్దామంటే కరెంట్ ఇబ్బందులున్నయ్. వానలు కురవక ఆకాశం వైపు చూస్తున్నం. ఉన్న నీటిని పారించి సాగు చేద్దామన్నా కరెంట్ తిప్పలు తప్పడం లేదు.
– తిమ్మప్ప, రైతు, అయిజ, జోగుళాంబ గద్వాల జిల్లా
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉ న్నప్పుడు కరెంట్ కష్టాలు చూశాం. తె లంగాణ ఏర్పడినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటిచ్చిండు. ఇ ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కరెం ట్ రాత్రిపూట వస్తే పొలాల్లో పడుకునే పరిస్థితి వచ్చేటట్లుంది. సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కేసీఆర్ సార్ ఇచ్చినట్లు 24 గంటల కరెంట్ ఇవ్వాలే. అప్పుడే పంటలు మంచిగ పండించుకుంటం. లేకపోతే పెట్టబడి ఎల్లక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తది. ఏ ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించాలె. వాళ్ల స్వార్థం కోసం చూసుకుంటే మేం ఆగమైతం.
– కృష్ణారెడ్డి, రైతు, అప్పంపల్లి, మరికల్ మండలం,నారాయణపేట జిల్లా
కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక 24 గంటల కరెంట్ నాణ్యతగా ఇ వ్వడంతో మోటర్లు, స్టార్టర్లు కా లకుండే.. నిరంతరం కరెంట్ ఉంటుండె కాబట్టి.. రైతులు ఎవరికి ఇష్టమొచ్చినప్పు డు వాళ్లు బోర్లు వేసుకునేటోళ్లు. దీంతో లో వోల్టేజీ సమస్యనే ఉం డకపోయేది. మోట ర్లు కూడా కాలిపో యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుండె. రిపేర్ కోసం తక్కువ మోటర్లు వచ్చేవి. దీంతో మాకు పని తగ్గిండె. 24 గంటల ఉచిత కరెంట్తో మోటర్లు, స్టార్టర్లు కాలిపోకపోవడంతో రైతులు సంతోషపడ్డారు. కానీ కాంగ్రెస్ హయాంలో లోవోల్టేజీ, అరకొర విద్యుత్ సరఫరా తో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతున్నయ్. దీంతో రై తులు ఎంతో ఇబ్బంది ప డుతున్నరు. మళ్లీ పాతరోజులొచ్చాయని బాధపడుతున్నరు.
2014 కన్నా ముందు ఎలాంటి సాగునీటి వనరులు లేవు. వర్షాధారం పైనే ఆధారపడి సేద్యం చేసేటోళ్లం. వానలు కురువక, పంటలు పండక పిల్లాపాపలతో ముంబాయి, హైదరాబాద్కు వలసెళ్లి బతికినం. పొలాల్లో సర్కారు తుమ్మచెట్లు దట్టంగా పెరిగి సేద్యం చేయడానికి రాకుండేది. పొలాలు బీళ్లుగా మారి, చెరువులు, కుంటలు ఎండి ఎడారిగా మారేవి. ఊళ్లల్లో ఉన్న వాళ్లు పంటలు పండక.. అప్పులు తీరక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంట్ ఉదయం 3గంటలు, రాత్రి మూడు గంటలు ఇ వ్వడంతో.. కరెంట్ కోసం మోటర్ల వద్ద రాత్రీపగలు తేడాలేకుండా పడిగాపులు కాసేటో ళ్లం.
చీకట్ల పాము కాట్లకు ఎంతమందో సచ్చిపోయిండ్రు. 2014తరువాత తెలంగాణ రాష్ట్రం వచ్చినంక.. కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించిండు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటిచ్చిండు. దీంతో ఏడేండ్లు పంటలు పుష్కలంగా పండినయ్. విద్యుత్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితే లేకుండే. నాణ్యమైన విద్యుత్ ఇస్తుండడంతో సంతోషంగా సాగు చేసుకున్నం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కథ మళ్లీ మొదటికొచ్చింది. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటిస్తలేరు. కోతలు విధిస్తున్నారు. లో వోల్టేజీ వల్ల మోటర్లు కాలిపోతున్నయి. – వీరపాగ వెంకటస్వామి, రైతు, నాగులపల్లి, కోడేరు మండలం, నాగర్కర్నూల్ జిల్లా
గతంలో వర్షాలు పడక, సాగునీళ్లు లేక పంటలు పండించే పరిస్థితి లేక చాలామంది రైతులు పొలాలను వదిలేసి పట్టణాలకు వలసపోయిండ్రు. ఏదోఒక పని చేసుకుంటూ బతికిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక రాష్ట్రం పచ్చబడింది. వనపర్తి చుట్టుపక్కలకు కూడా సాగునీళ్లు వచ్చినయ్. దీంతో ఊళ్లు విడిచిపోయిన రైతు కుటుంబాలు మళ్లీ సొంత ఊరికి వచ్చి సంతోషంగా సాగు చేసుకొని బతికిండ్రు. ఈ పదేండ్లలో పట్టణాలను వదిలి పల్లెలకు వచ్చిండ్రు.
సాగునీళ్లు, కరెంట్ మంచిగ ఉండడంతో పంటలు పండించుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే కరెంట్ కోతలు, సాగునీళ్లు అందక, వర్షాలు పడక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాం. కేసీఆర్ ముందుచూపుతో కట్టిన అన్ని ప్రాజెక్టులను ఈ సర్కారు ఎండబెట్టింది. గతంలో ఎండాకాలంలో కూడా పల్లెల్లోని చెరువులు సైతం నీళ్లతో కళకళలాడేవి. ఇప్పుడు నీళ్లు లేక పాతరోజులు గుర్తొస్తున్నయ్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామాల్లో కళ తప్పినయ్. దీంతో పంటలు సాగు చేయాలా? లేక మళ్లీ పట్నం పోయి ఏమైనా పని చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నం.
– తిరుపతయ్యగౌడ్, రైతు, కడుకుంట్ల, వనపర్తి మండలం
గతంలో సాగుకాలం వచ్చిందంటే మోటర్ మెకానిక్లకు చేతినిండా పనిదొరికేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది. వానకాలం మొదలైనా వర్షాలు లేక రైతులు తుకాలు పోయడానికి ముందుకొస్తలేరు. ఇప్పటికే బోర్లు, కాల్వలను సరిచేసుకునేటోళ్లు. అలాంటికి ఇప్పటి దాకా రైతులు సాగు మొదలు చేయలేదు. ఇలా అయితే మాలాంటి మెకానిక్లకు పనిదొరకకపోతే ఏం చేయాల్నో అర్థమైతలేదు. గత పదేండ్లలో మోటర్లు కాలిపోయిన పరిస్థితులు చాలా తక్కువ. ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కరెంట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. పంటలు సాగైతేనే కరెంట్ సరఫరా గురించి తెలుస్తది. తెలంగాణ రాకముందు కరెంట్ వచ్చి పోతుండె కాబట్టి మోటర్లు కాలిపోతయని రైతులు బోర్లకాడనే పండుకునేటోళ్లు. ఆ రోజులు మళ్లీ వచ్చేటట్లు కనిపిస్తున్నయని రైతులు మాతోన అంటున్నరు. ఊళ్లోని పెద్ద మనుషులు రచ్చకట్ట వద్ద కూర్చొని కరెంట్ మీదనే మాట్లాడుకుంటున్నరు. కేసీఆర్ను ఓడించుకున్నం.. మళ్లీ పాత రోజులొస్తయేమోనని భయపడుతున్నారు.
– అశోక్, మోటర్ మెకానిక్, వనపర్తి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ కోసం ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకోవడం తప్పా.. కరెంట్ కష్టాలు మాత్రం తీర్చింది లేదు. కరెంట్ ఇవ్వకుండా మమ్మల్ని సావగొట్టిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిండ్రు. కరెంట్ స్తంభాలు పాతుకొని బోరు బావులకు లైన్లు గుంజుకున్నాం. నిరంతర కరెంట్ ఉండడంతో 5 హెచ్పీ మోటర్లు పెట్టుకుని దర్జాగా పంటలు పండించుకున్నం. కేసీఆర్ రైతు పక్షపాతి. మా బాగుకోసం పరితపించిన మహా నాయకుడు. కష్టాలు దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడిన మహానుభావుడు. ఆయన హయాంలో నయా పైసా అవినీతి జరగలేదు.
– గవినోళ్ల హన్మిరెడ్డి, రైతు, బిజ్వారం, ఊట్కూర్ మండలం , నారాయణపేట జిల్లా
రాత్రి వేళ కరెంట్ తీస్తుండటంతో వ్యాపారం అయితలేదు. ప్రజలు పగలంతా పనులు ముగించుకొని రాత్రి వేళ కొనుగోలు చేయడానికి వస్తరు. ఆ టైంల కరెంట్ లేక తిరిగి వెళ్తున్నరు. వ్యాపా రం జరుగక ఇబ్బందులు పడుతున్నం. కేసీఆర్ హయాంల కరెంట్ బాగుండే. గాలొచ్చినా, వానొచ్చినా తీసెటోళ్లు కాదు. ఇప్పుడు అంతా మరింది.
– బాలరాజు, చిరు వ్యాపారి, అయిజ పట్టణం,జోగుళాంబ గద్వాల జిల్లా