కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాపురించాయని దుమ్మెత్తిపోస్తున్నారు. పవర్ ప్రాబ్లంతో ఇప్పటికే యాసంగి పంటల సీజన్ దెబ్బతినగా.. సాగునీరు సక్రమంగా లేదు.. విత్తనాలు విత్తినా వరుణుడి కరుణ లేదు.. బోర్ల కింద సాగైన పంటలకు నీళ్లు పెడుదామంటే కరెంట్ సక్రమంగా ఉండదు.. రాత్రిళ్లు జాగరణ తప్పడం లేదని వాపోయారు. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నాటి బీఆర్ఎస్ సర్కారే బాగుండే అని గుర్తు చేసుకుం టున్నారు. నాడు ధగధగ లాడితే.. నేడు కరెంట్ కోతలతో అల్లాడుతుండడంపై మండిపడుతున్నారు. తెలంగాణను వెలుగుల దివ్వెగా మార్చిన కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీయడం సరికాదంటున్నారు.
చేతులెత్తేశారు..! అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు మోసపోయారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆదుకుంటుందని భావించినా ఇందుకు విరుద్ధంగా రైతుల నడ్డి విరిచే చర్యలు ప్రారంభమయ్యాయి. వచ్చిన మూడు నెలలకే యాసంగి పంటకు విద్యుత్ సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలన్నీ ఎండిపోయాయి. పండిన కాస్త పం టను కూడా కొనలేని పరిస్థితి దాపురించింది. రైతు భరోసా పేరుతో ఇచ్చిన హామీ అటకెక్కిం ది. 2014 ముందు పరిస్థితులు దాపురించా యి. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పో తుందో.. తెలియని పరిస్థితి మళ్లీ తలెత్తింది. రైతులకు ఆసరాగా నిలిచి.. నాణ్యమైన నిరంత ర విద్యుత్ సరఫరా చేస్తే.. అందులో కేసీఆర్ గోల్మాల్ అంటూ దోషిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుండడంతో రైతులు ఖండిస్తున్నారు. ఇది తీవ్రమైన చర్య అంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. నారుమళ్లు వేసి ఇలా కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే.. అలా కరెం ట్ పోతుందని.. రోజుల తరబడి నీళ్లను పారిం చే దుస్థితి నెలకొన్నదని అన్నదాతలు వాపోతున్నారు. మళ్లీ పాత రోజులు వచ్చాయని లబోదిబోమంటున్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఎన్కటి రోజులు మళ్లా దాపురించాయి. పదేండ్ల కిం ద కరెంట్ కోసం పొలాల వద్ద రైతులు జాగరణలు చే స్తూ నిరీక్షించేవారు. విద్యుత్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతు లు నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ అంటూ ఒకరు.. 9 గంటల విద్యుత్ ఇస్తామని ఆర్భాటపు ప్రకటనలు మంత్రులు, ఎమ్మెల్యేలు గుప్పిస్తున్నా..
అప్పుడప్పుడు వచ్చే కరెంట్ కోసం రైతుల దీనావస్థలు పడుతున్నారు. 2014 ముందు ఉమ్మడి రా ష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇదే పరిస్థితి. పంటలు పండక.. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై వ్యవసాయ కూలీలంతా పొట్టగూటి కోసం ఇతర నగరాలు, పట్టణాలకు వలసపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సీఎం అయ్యాక పదేండ్లపాటు వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. 24 గంటల ఉచిత కరెంట్ అందించి మూడు పంటలు పుష్కలంగా పండేలా చేశా రు. బీడు భూములు సైతం సాగు బడిలోకి వచ్చేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు నిలిచిపోయి రికార్డు స్థాయి లో పంటలు సాగయ్యాయి. ఇతర రాష్ర్టాల నుంచి మన జిల్లాకే వలస వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పాత రోజులు దాపురించాయి. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గాకముందే ముఖ్యంగా వ్యవసాయ రంగం కుదేలైంది. వచ్చిన మూడు నెలల కి యాసంగి పంటకు కరెంట్ లేక వేలాది ఎకరాలు ఎండిపోయాయి. కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడు లేక రైతులు పడిన అవస్థలు వర్ణణాతీతం. కరెంట్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పదేళ్లపాటు రైతంగానికి నిరంతర విద్యుత్ అందించిన కేసీఆర్పై నిందలు వేస్తుంటే ఉమ్మడి జిల్లా రైతులు భరించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కర్షకులను మంచిగా చూసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అంటున్నారు. మళ్లీ పాత రోజులు దాపురించాయని,.. రైతులను కాంగ్రెస్ వాళ్లు ఆ దుకునే అవకాశాలే కల్పించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న దాఖలాల్లేవు. ఒకరు వ్యవసాయం దండగ అంటే మరొకరు పండగ అం టూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. 2014 కంటే ముందు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని తికమక పరిస్థితులు ఉండేవి. క రెంట్ కోసం వ్యవసాయ బావుల వద్ద రైతులు జా గరణ చేసేవారు. తెలుగుదేశం హయాంలో 7 గంటల కరెంట్ ఎటు సరిపోక పం టను కాపాడుకోలేక రైతుల అవస్థలు చెప్పలేనివి. ఆ తర్వాత వచ్చిన వైఎస్ వ్యవసాయాన్ని పండగ చేస్తా అంటూ 7 గంటల కరెంట్ను 9 గం టలకు పెంచి ఉచిత విద్యుత్ అం దించారు. కానీ నిర్ణీత సమయంలో అప్పుడో గంట.. ఇప్పుడు రెండు గంటలు అన్నట్లు కరెంట్ సరఫరా అయ్యేది. దీంతో అర్ధరాత్రి 12 గం టల తర్వాత వచ్చే కరెంట్ కోసం భా ర్యాపిల్లల్ని వదిలి ఎక్కడో ఉన్న పొలాలకు పరుగులు తీసేవారు. ఒకేసారి విద్యుత్ వాడడంతో లోడ్తో మోట ర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. బతుకు జీవుడా అంటూ ఉమ్మడి జిల్లాలో ఏటా 14 లక్షల మంది వలసలు వెళ్లేటోళ్లు. బంగారు పం టలు పండే భూములు ఉన్నప్పటికీ తినడానికి తిండి లేక రైతులే కూలీలుగా మారి మహా నగరాలకు వలస బాట పట్టిన దుస్థితి నాటిది. మోటర్లు ఆన్ చేసేందుకు వెళ్లి ఎందరో విద్యుదాఘాతానికి గురై.. మరికొందరు చీకట్లో పా ము కాటుకు గురై ఎం దరో మృతి చెందా రు. వీటన్నింటిని అ ధిగమిస్తే పంటలు పండక.. దిగుబడి రాక రైతులు ఆత్మహత్య చేసుకునేటోళ్లు.. ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూడడంతో వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్ల కో సం గోసపడ్డ తెలంగాణ స్వరాష్ట్ర సాధనతో.. కేసీఆర్ ప్రభుత్వంలో కల నెరవేరింది. ముందుగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించి.. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్లింది. రైతాంగానికి చేయూతనివ్వడంతోపాటు అనుబంధ రంగాలను కూ డా ప్రోత్సహించడంతో నిరంతర విద్యుత్ అందించ డం సాధ్యమైంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నాణ్యమైన విద్యుత్ను 24 గంటలపా టు అం దించింది. ఉచిత విద్యుత్, సాగునీరు పుష్కలం కావడంతో ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూశా రు. దీంతో వ్యవసాయం పండుగలా మారింది. మాట లే కాదు.. కేసీఆర్ ప్రభుత్వం చేతల్లోనూ చూపించిం ది. దీంతో రైతులకు రాత్రిళ్లు జాగరణ తప్పింది. ఇం టి నుంచి సెల్ఫోన్లో ఎక్కడో ఉన్న పొలం వద్ద ఉన్న మోటర్ను ఆన్.. ఆఫ్ చేసే టెక్నాలజీని అందుకున్నా రు. స్విచ్ ఆన్ చేస్తే బోర్లో ఉన్న జలం పంట పొలాలను తడిపేది. బీడు భూములు సైతం పంట పొలాల తో సస్యశ్యామలంగా మారాయి. ఎకరా ధర రూ.ఐదా రు లక్షలు పలకని భూములు సైతం ఏకంగా రూ.కో టికి ఎగబాకింది. దీంతో వలసలన్నీ వాపస్ వచ్చాయి. గ్రామాలు, గిరిజనన తండాల్లో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పూరిళ్లు మాయమై డాబా ఇండ్లు వెలిశాయి. మరోవైపు తాగునీటికి కూడా ఇబ్బందులు లేకుండా చేయడంతో గ్రామాల్లో పండు గ వాతావరణం నెలకొన్నది. ఉచిత విద్యుత్ అనుబం ధరంగాల మద్దతుతో రైతులు లక్షాధికారులు అయ్యా రు. పంట దిగుబడులు పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో రైతుల అప్పులు మాయమై మరింత ఉత్సాహంగా వ్యవసాయాన్ని అందిపుచ్చుకున్నారు.
కాంగ్రెసోళ్లు ఇంత బాధపెడుతున్నరు.. కరెంట్ సక్కగ ఇస్తలేరు.. తుకాలు పెట్టుకుందామంటే కరెంట్ లేక సన్నబోరు మూడు దినాల సంది నీళ్లు పోస్తలేదు. యాసంగిలో కూడా పంటలన్నీ ఎండిపోయినయ్. ఉన్న కొంచెం పంటను అమ్ముకుందామంటే వడ్లను కొనేటోళ్లే లేరు. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇది ఏం గవర్నమెంటో ఏమో.. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే.. కరెంట్ లేక శానా ఇబ్బందులు పడుతున్నాం.
రైతులు సంతోషంగా లేరు. తెలంగాణ రాకముందు ఎట్లుండెనో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇటు కా లం బాలేదు.. అటు కరెంట్ బాలేదు.. పంటలు చేతికొ చ్చే పరిస్థితి అస్సలు కనిపిస్తలేదు. కేసీఆర్ హయాంలో రైతులు 24 గంటల కరెంటు ఇస్తే.. ఇష్టం వచ్చిన పంటలు పండించినం. కాంగ్రెస్ వచ్చినంక కరెంట్కు మళ్లీ పాత రోజులొచ్చినయ్. ఊళ్లో ఎవరిని అడిగినా కరెంట్ ఎప్పుడు వస్తదో చెప్పలేని పరిస్థితి ఉంది.