పాలమూరు, జూన్, 22 : నీట్ పేపర్ లీకేజీపై విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించారు. మహబూబ్నగర్లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సం ఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర పభుత్వం మొండి వైఖరితో గ్రేస్ మార్కులు తొలగించి జూన్ 23 న మళ్లీ పరీక్ష నిర్వహించి, 30న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పడం నీట్ అవకతవకలను పక్కదారి పట్టించడమేనన్నారు. ఫలితంగా నీట్ మార్కులు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. నీట్ పరీక్షపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయకుండా ఎన్టీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీహార్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో పేపర్ లీకేజీపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మా త్రమే నీట్ ర్యాంకులు అత్యధికంగా వచ్చాయని, వాటి పై కూడా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డి మాండ్ చేశారు. రీ ఎగ్జామ్ నిర్వహించి, ఎన్టీఏను ర ద్దు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న విచారణ ఎన్టీఏ చైర్మన్, డైరెక్టర్లను రద్దు చేసి వారిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భరత్, రమేశ్, ప్రశాంత్, ఆవేష్, లక్ష్మణ్, రాజు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.