వనపర్తి టౌన్, జూన్ 20 : నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు మట్టిలో ఆడడం, ఆ తర్వాత నేరుగా తినడం వల్ల శరీరంలో నులిపురుగులు తయారవుతాయన్నారు.
ఈ పురుగులు పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయని తద్వారా పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుందన్నారు. దీనివల్ల పిల్లలు భుజించిన ఆహారం ఒంటికి పట్టకపోవడం, సరైన ఎదుగుదల ఉండకపోవడం, తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. 1 నుంచి 19 ఏండ్ల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా తినిపించాలన్నారు. మాత్రలు తినని వారిని గుర్తించి జూన్ 27న ఇంటింటికీ తిరిగి మాత్రలు తినిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతి చిన్నారికి నులిపురుగుల మాత్రలు వేసి రక్తహీనత నివారణకు కృషి చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. అలాగే బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ను పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేశ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయచంద్రమోహన్, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాసులు, ఎంఈవో శ్రీనివాసులు, హెచ్ఎం ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు, జూన్ 20 : ఏడాది నుంచి 19 ఏండ్ల వయస్సు వారంతా ప్రతి ఆర్నెళకోసారి ఆల్బెండజోల్ మాత్రలు వాడితే నులిపురుగులను నివారించవచ్చని జిల్లా ప్రోగ్రాం అధికారి రామచందర్రావు అన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం పెబ్బేరు హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి చంద్రశేఖర్, ము న్సిపల్ కమిషనర్ ఆదిశేషు, వైద్య సిబ్బంది సూర్యనారాయణ, రాజశేఖర్, హెచ్ఎం విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
ధరూరు, జూన్ 20 : మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేసినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రతాపరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నోడల్ ఉపాధ్యాయులు రాఘవేంద్ర, వెంకటలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
మదనాపురం, జూన్ 20 : నులి పురుగుల నివారణ కోసం ప్రతి చిన్నారికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని ఎంపీపీ పద్మావతి అన్నారు. గురువారం స్థానిక పీహెచ్సీ సిబ్బంది కేజీబీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు భవాని, కేజీబీవీ ఎస్వో రేణుక, హెల్త్ సూపర్వైజర్ ప్రమీల, రిటైర్డ్ టీచర్ రవీందర్రెడ్డి, ఆరోగ్య వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్, జూన్ 20: పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిచండంతో నులి పురుగులను నివారించవచ్చని మండల వైద్యాదికారి ప్రసూణరాణి పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఆరోగ్య సిబ్బంది ఆశాలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, జూన్ 20: పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీ, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు చిట్టెమ్మ, శ్రీదేవి, తిప్పమ్మ, కవిత, ఆర్కేఎస్కే హెల్త్ కౌన్సిలర్ రామాంజనేయులు పాల్గొన్నారు.
చిన్నంబావి, జూన్ 20 : మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల పీఎస్, జెడ్పీహెచ్ఎస్, అంగన్వాడీ కేంద్రా ల్లో విద్యార్థులకు వైద్యసిబంది ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులతో కలిగే దుష్పరిణామాలను హెల్త్ సిబ్బంది కేశవులు వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జహంగీర్, ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ, ఆశవర్కర్లు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గోపాల్పేట, జూన్ 20 : గోపాల్పేట, రేవల్లి మండలాల్లో వైద్య సిబ్బంది, 1 నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు గురువారం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. గోపాల్పేట మండల కేంద్రంలోని కేజీబీవీలో జెడ్పీటీసీ మంద భార్గవి విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, డాక్టర్ కృష్ణకుమారి, సీహెచ్వో సిద్ధిగౌడ్, సూపర్వైజర్లు సుచి త్ర, కౌసల్య స్కూల్ ప్రిన్సిపాల్ దీప్తి, ఆశలు పాల్గొన్నారు.
మల్దకల్, జూన్ 20 : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించారు. వైద్యాధికారిణి స్వరూపారాణి మాట్లాడుతూ మొత్తం 350మంది విద్యార్థులకు మాత్రలను వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో సురేశ్, సీహెచ్వో వెంకటస్వామి, ఏఎన్ఎం సుజాత, ఆశవర్కర్ నర్సమ్మ, పరిమళ, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
కొత్తకోట, జూన్ 20 : మండలంలోని సంకిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో గురువారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంతమౌనికలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి హాసియా, వైద్య సిబ్బంది విజయ్కుమార్, సమీర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 20: పదోపటలంలోని సాయుధ చైతన్య పాఠశాల విద్యార్థులకు ఇటిక్యాల పీహెచ్సీ సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. పాఠశాల షాషావలి, ఇన్చార్జి ఆంజనేయులు ప్రారంభించారు. 520మంది విద్యార్థులకు వేసినట్లు ఏఎన్ఎం పరిమళ తెలిపారు.
గద్వాలటౌన్, జూన్ 20 : నులిపురుగుల నివారణ కోసం పంపిణీ చేస్తున్న ఆల్బెండజోల్ మాత్రలు తప్పక తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ సరిత సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఇన్చార్జి డీఎంహెచ్వో శశికళ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు మాత్రలు తీసుకునేలా చూడాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సిద్ధప్ప, జిల్లా మహిళా వెల్ఫేర్ అధికారి సుధారాణి, ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియోల్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల, జూన్ 20 : మండల కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలను మండల వైద్యాధికారి రాజశేఖర్ సందర్శించి చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.
పాన్గల్,జూన్20: నులిపురుగుల నిర్మూలనతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామయ్య, ఎంఈవో లక్ష్మణ్నాయక్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం మండలకేంద్రంతోపాటు, రేమద్దుల, అన్నారం తదితర ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హైమావతి, హెచ్ఎంలు శ్రీనివాసులు, నరేందర్, హెల్త్ అసిస్టెంట్లు రాంచందర్, శ్రీలక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆత్మకూరు, జూన్ 20: నులి పురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎంపీపీ శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని జాతరమైదానం ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్తో కలిసి పిల్లలకు మాత్రలను వేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోటేశ్వర్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైద్యాధికారి శరత్, అధికారులు పాల్గొన్నారు.