మాగనూరు, జూలై 3 : మండలంలోని మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు రెండు రోజులుగా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు వచ్చి కూర్చొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు పాఠశాల న డుస్తున్నది. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా తి మ్మన్న అనే ఉపాధ్యాయుడు హెచ్ఎంగా ప్రమోషన్ రావడంతో కొ ల్పూర్కు వెళ్లారు. మిగతా ఇద్దరు ఉండగా ఒకరు వాళ్ల బంధువు చ నిపోవడంతో లీవ్పై వెళ్లాడు. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సైతం రెం డు రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు వచ్చి కూర్చొ ని ఆడుకొని పోవడం తప్పా ఏం చేయడం లేదు.
అయితే ఉపాధ్యాయులు లేకపోవడంతో వంట ఏజెన్సీ వారు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా పెట్టడం లేదు. మెనూ ప్రకారంగా బుధవారం విద్యార్థులకు గుడ్లు పెట్టాల్సి ఉండగా కేవలం బిస్కెట్లు ఇచ్చి సరిపెట్టారు. రెండు రోజులుగా ఉపాధ్యాయులు హాజరుకాని విషయంతోపాటు మధ్యాహ్న భోజనం గురించి గ్రామస్తులు జిల్లా విద్యాధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా ఆయన స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంతో మాట్లాడుతానని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేలా చూడాలని, దీంతోపాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.