తిరుమలాయపాలెం, జూలై 4 : ‘అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలాన్ని కోనసీమగా మార్చారు. రెండు పంటలు పండేలా సస్యశ్యామలం చేశారు. ఆ ఘనత మీకు, మీ ప్రభుత్వానికే దక్కుతుంది. గెలిచినా.. ఓడినా మేము మీ వెంటే ఉంటాం.. ఎన్నాైళ్లెనా మీతోనే కలిసి నడుస్తాం’ అంటూ తిరుమలాయపాలెం మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. మీ ప్రభుత్వం చేపట్టిన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం మండలం సస్యశ్యామలంగా మారింది.
భూముల ధరలు విపరీతంగా పెరిగి మాకు మేలు జరిగిందని వివరించారు. మీ పాలనలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు కాల్వల తవ్వకానికి మా భూములు ఇచ్చాం. ఆ భూములకు సంబంధించి ఇంకా కొందరికి పరిహారం అందాల్సి ఉందని కేసీఆర్కు వివరించారు. రైతుల మాటలు ఆసక్తిగా విన్న కేసీఆర్ వారిని అభినందించడంతోపాటు ఎంతో సంతోషించారు. వారితో కలిసి ఫొటోలు దిగి.. భోజనాలు పెట్టి పంపించారు. కార్యక్రమంలో కేశ్వాపురం బీఆర్ఎస్ నాయకులు జక్కుల వీరన్న, వీరెల్లి నవీన్, ఐతనబోయిన వీరస్వామి, ఈదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.