వైరా రూరల్, జనవరి 7: తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ర్టాన్ని ఇచ్చిన ఆమెకు ఇక్కడ విజయాన్ని కట్టబెట్టి తెలంగాణ ఇచ్చిన రుణాన్ని తీర్చుకుంటామన్నారు. అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడం కోసం కుటిల యత్నాలు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పగడాల మంజుల, పమ్మి అశోక్, సూతకాని జైపాల్, బొర్రా రాజా, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఖమ్మం, జనవరి 7: టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్.అఫ్జల్ హాసన్, ఆర్వీఎస్. సాగర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కల్లూరు, సత్తుపల్లి, మధిర యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాలు శాభాసు జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను, మెడికల్ ఫోరం అధ్యక్షులు బుద్దా రామకృష్ణ, హాస్పిటల్ ఫోరం అధ్యక్షులు ఫిరంగి శ్రీను, ఇరిగేషన్ మెయింటెనెన్స్ ఫోరం కార్యదర్శి రమణారెడ్డి, ఏఈవో ఫోరం అధ్యక్షులు నాగుల్ మీరా, బాషా, సరోజిని, అరుణ, జిల్లా బాధ్యులు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, జనవరి 7: మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమారని ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు, కళాసారథి డాక్టర్ నాగబత్తిన రవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సతరించి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కళాకారుడిని ఆదుకోవాలని డిప్యూటీ సీఎంను కోరారు.