ఖమ్మం కమాన్బజార్, జాన్ 30: బొగ్గు బ్లాకుల విషయంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇతర రాష్ర్ర్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు గనులను కేటాయించినప్పుడు తెలంగాణలో ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరెట్ల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళలను కొనసాగిస్తామని వివరించారు. ఖమ్మంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశ నిర్ణయాలను ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. కమ్యూనిస్టుల కార్యాచరణ వల్లనే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంశాల వారీగా మద్దతునిస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని అన్నారు. సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, బాగం హేమంతరావు, పద్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.