మధిర రూరల్/ చింతకాని, జూన్ 30: మధిర, చింతకాని మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించారు. ఆయా మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తొలుత మధిర మండలంలో బోనకల్లు, ఆళ్లపాడు, వంగవీడు రహదారులను కలుపుతూ వంగవీడులో రూ.30 కోట్లతో బీటీ రోడ్డు విస్తరణ పనులకు, చిలుకూరులో రూ.70 లక్షలతో చేపట్టిన బీటీ రోడు ్డపనులకు, చిలుకూరు – దొడ్డదేవరపాడు మధ్య రూ.2.85 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు, సిద్దినేనిగూడెం వద్ద రూ.2.75 కోట్లతో చేపట్టిన సిద్దినేనిగూడెం – పెనుగోల లింకు రోడ్డు పనులకు, మాటూరు – ముస్లిం కాలనీని కలుపుతూ రూ.5 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంసస్థాపనలు చేశారు. సిద్దినేనిగూడెంలో శీలం తిరుపతమ్మ, కామసాని కోటేశ్వరమ్మ, కామసాని పద్మ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందచేశారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో గణేశ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చింతకాని మండలంలోనూ భట్టి పర్యటించారు. బొప్పారం-గాంధీనగర్ మధ్య రూ.1.75 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ రాజ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అధికారులు, నాయకులు కొండపల్లి శేఖర్రెడ్డి, నాగసూరారెడ్డి, కిలారు మనోహర్బాబు పాల్గొన్నారు.