చండ్రుగొండ, నవంబర్ 11 : బీఆర్ఎస్ పాలనలో మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రెండో సారి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత మద్దుకూరు శ్రీవేంకటేశ్వరరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. మద్దుకూరు, దామరచర్ల, రామక్కబంజర, అయ్యన్నపాలెం, చండ్రుగొండ, బాలికుంట, బెండాలపాడు, గుర్రంగూడెం గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఏండ్లుగా ఉన్న పోడు సమస్యను పరిష్కరించి, అర్హులైన వారందరికీ పోడు పట్టాలిచ్చారని, మిగిలిన వారికి, గిరిజనేతరులకు వచ్చే ఏడాది పట్టాలిస్తామన్నారు.
మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలన్నారు. అన్నివర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించి, ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, కొణకండ్ల వెంకటరెడ్డి, సయ్యద్ రసూల్, భూపతి రమేశ్, మేడా మోహన్రావు, నల్లమోతు వెంకటనారాయణ, నరుకుళ్ల సత్యనారాయణ, గుగులోత్ శ్రీనివాస్నాయక్, సూర వెంకటేశ్వరరావు, చీదెళ్ల పవన్కుమార్, వంకాయలపాటి బాబురావు, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, భూపతి శ్రీనివాసరావు, గాదె లింగయ్య, మల్లెంపాటి నాగేశ్వరరావు, మల్లెం వెంకటేశ్వర్లు, గుగులోత్ ప్రవీణ్ప్రకాశ్, బడికల శ్రావణ్కుమార్, మార్తి సత్యనారాయణ, గుగులోత్ రాందాసు, ఇర్పా లక్ష్మిపతి, సంగొండి వెంకటకుమారి, నరుకుళ్ల అప్పాజి, వాసు, ఓరుగంటి శ్రీనివాస్, బానోత్ రన, పూసం వెంకటేశ్వర్లు, గుగులోత్ శివ పాల్గొన్నారు.