అన్నపురెడ్డిపల్లి, సెప్టెంబర్ 6: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అదే క్రమంలో మహిళల ఆర్థికాభివృద్ధికి కూడా అధిక ప్రాధన్యమిస్తున్నారని అన్నారు. అన్నపురెడ్డిపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన.. మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, శ్రీసాయి బాలాజీ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కాగా, తొలుత మండలానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు, వీవోఏలు పుష్ఫగుచ్ఛాలు,
హారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కూడా మండల కేంద్రంలో పాదయాత్రగా బయలుదేరి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. బీఆర్ఎస్ నాయకులు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు బోయినపల్లి సుధాకర్రావు, సున్నం లలిత, భారత లాలమ్మ, మామిళ్లపల్లి రామారావు, బుడేన్, అన్నపూర్ణ, రాంభద్రయ్య, బోడా పద్మ, నున్నా బసవయ్య, సడియం తిరుపతయ్య, సున్నం చిరంజీవి, కొత్తూరు వెంకటేశ్వరరావు, మామిళ్లపల్లి లక్ష్మణరావు, జంగాల శ్రీనివాసరావు, గాలం వలరాజు, వీరబోయిన వెంకటేశ్వర్లు, పోట్రు వెంకటేశ్వరరావు, నర్సారెడ్డి, మాధవరెడ్డి, మాందాస్ ఎల్లయ్య, చల్లా రాంబాబు, అప్పారావు, వాడే రాంబాబు, రమేశ్, చెన్నారావు, సన్నేపల్లి సుధాకర్రావు, ప్రకాశ్రావు, చిన్న, సత్యంబాబు, పుల్లారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.