రఘునాథపాలెం, జూన్ 25: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) కమిషనర్గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహించిన ఆదర్శ్ సురభి.. వనపర్తి కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. దీంతో ఖాళీగా ఉన్న కేఎంసీ స్థానంలో మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ అగస్త్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. నూతన కమిషనర్ను అసిస్టెంట్ కమిషనర్ సంపత్కుమార్, ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డిప్యూటీ ఈఈ ధరణి, నవ్యజ్యోతి, ఏఈ సతీశ్, ఏసీపీ వసుంధర, నగరపాలక సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఖమ్మం నగరపాలక కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ అగస్త్య అనంతరం కేఎంసీ మేయర్ పునకొల్లు నీరజను మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్కు మొక్కను అందజేశారు. గతంలో తాను మహబూబాబాద్ ట్రైనీ కలెక్టర్గా, మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్గా పనిచేసినట్లు మేయర్కు వివరించారు.