అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శనివారం అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం, తిరుమలకుంట, ఉశిర్లగూడెం, కొత్త మామిళ్లవారిగూడెం, కోర్సగూడెం, వినాయకపురం గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆసుపాక గ్రామంలో పలు పార్టీలకు చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు హారతులు పట్టి, గిరిజన నృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. వినాయకపురం నుంచి పలు గ్రామాల మీదగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆసుపాక గ్రామంలో రాజకుమార్ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. అశ్వారావుపేటలో రూ.25 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్కు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 10వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పోడు భూములకు హక్కులు కల్పించి రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ఉప సర్పంచ్ తల్లాడి వెంకటేశ్వరావు, కార్యదర్శి మోతీలాల్ విజ్ఞప్తి మేరకు సొంత నిధులను మంజూరు చేశారు. మరో మూడు సీసీ రోడ్లు మంజూరు చేశారు.
200మంది బీఆర్ఎస్లో చేరిక
ఆసుపాక గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్ ఆధ్వర్యంలో మనేపల్లి రాజకుమార్, యర్రంశెట్టి రమేశ్, బయ్యా వినోద్, జర్బల దుర్గమ్మ, సోడె రాజేశ్, సోడె ప్రసాద్, అజ్మీరా రాజులు, లకావత్ వెంకటేశ్వరరావు, భూక్యా మేగ్యా ఆధ్వర్యంలో దారవత్తు కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, భూక్యా బాలి, చిన్నారి, అజ్మీరా మంగలు, జొన్నలగడ్డ రవీంద్ర ఆధ్వర్యంలో రాయి శ్రీను, జొన్నలగడ్డ రాజకుమార్, సత్యవతి, దుర్గయ్య సుమారు 200 మంది పార్టీలో చేరారు. వీరందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.