సిరిసిల్ల రూరల్, మే 17: మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్విండో కేడీసీసీబీలో విలీనం కానున్నది. ఈ మేరకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుకు చైర్మన్ జీల కిషన్యాదవ్, వైస్ చైర్మన్ బెజ్జారపు నారాయణగౌడ్, పాలకవర్గ సభ్యులు దరఖాస్తు అందజేశారు. ఇప్పటి వరకు ఎస్బీఐ బ్యాంకు పరిధిలో ఉన్న పెద్దూరు సింగిల్విం డో, ఇక నుంచి కేడీసీసీబీలో విలీనం కానున్నది. కేడీసీసీబీ ద్వారా రైతులకు మెరుగైన సేవలందుతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సీఈవో గౌరీశంకర్, డైరెక్టర్లు సలేంద్రి బాలరాజు, ముషికం సత్తయ్య, తదితరులు ఉన్నారు.