గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు 91.40 కోట్ల లాభం పొందిందని, 5,625 కోట్ల వ్యాపారం చేసిందని కేడీసీసీబీ, టెస్కాబ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 వేల కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని, 3,800 కోట్ల రుణాలు అందిస్తామని చెప్పారు. దశాబ్దకాలంగా స్థిరమైన లాభాలు ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు గణనీయ లాభాలు పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
– కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేడీసీసీ బ్యాంకు గణనీయమైన లాభాలు సాధించిందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 9 జిల్లా సహకార బ్యాంకులు ఉమ్మడిగా 19,060 కోట్ల వ్యాపారం చేశాయని, 342 కోట్ల లాభాలు ఆర్జించాయని చెప్పారు. ఇందులో కరీంనగర్ బ్యాంకు నుంచి 5,625 కోట్ల వ్యాపారం చేసి, 91.40 కోట్ల లాభాలు ఆ ర్జించామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర సహకార బ్యాంకు ద్వారా మరో 19 వేల కోట్ల వ్యాపారం జరిగి, 142 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని సహకార వ్యవస్థ ద్వారా సుమారు 40 వేల కోట్ల వ్యాపారం జరిగితే ఇం దులో కరీంనగర్ సింహ భాగంలో నిలవడం గొప్ప పరిణామమని స్పష్టం చేశారు. కేడీసీసీబీ రాష్ట్ర స్థాయి వ్యాపారంలో 28 శాతం, లాభాల్లో 35 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2014-15లో ఇప్పటి ఇందులో కనీసం నాలుగో వంతు కూడా వ్యాపారం జరగ లేదన్నారు. అప్పటికీ, ఇ ప్పటికీ సహకార బ్యాంకులు గణనీయమైన వృద్ధి ని సాధించాయని చెప్పారు. 2020లో కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత మొదటి రెండేళ్లలో కొవిడ్తోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అప్పుడు 20 నుంచి 22 శాతమే వృద్ధి రేటు ఉండేదన్నారు. బ్యాంకుల లాక్ డౌన్ లేకుండా రైతులకు అందుబాటులో ఉండి సేవలందించామన్నారు.
కేడీసీసీబీ వృద్ధి రేటే మెరుగు
కరీంనగర్ డీసీసీబీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు 0.84 శాతమే సేకరించగలిగామని, రుణాల్లో 26.78 శాతం చొప్పున మొత్తం గా చూస్తే 14.79 శాతం వృద్ధి సాధించామన్నారు. వృద్ధి రేటు తగ్గడానికి ఆశించిన రీతిలో డిపాజిట్లు పెరగకపోవడమే కారణమన్నారు. మిగతా బ్యాం కులతో పోల్చుకుంటే కేడీసీసీబీ వృద్ధి రేటే బాగుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయానికి మంచి వసతులు కల్పించిందని, ఎన్నడూ లేని విధంగా బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని తెలిపారు. ఈ యేడాది రబీలో రాష్ట్రంలో 73 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో యాసంగిలో ఎన్నడు కూడా 23 లక్షలకు మించి సాగైంది లేదన్నారు.
సీఎం సూచనలతో అనేక సంస్కరణలు
సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు స హకార వ్యవస్థలో, బ్యాంకుల్లో అనేక సంస్కరణ లు తెచ్చామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, సహకార ఉద్యోగులకు దేశంలోనే మొదటిసారి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి న ఘనత రాష్ర్టానికి దక్కుతుందని తెలిపారు. ఇం దుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ నెల నుంచే పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. కంప్యూటరీకరణ కూడా విస్తృతంగా చేపట్టామని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీరావుపేట సొసైటీ పరిధిలో బ్యాంకు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయని, కేడీసీసీబీలో చే పట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా తీసుకురావాలని నాబార్డ్, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయని తెలిపారు.
3800 కోట్ల రుణాలిచ్చేందుకు ప్రణాళికలు
ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు 1,500 కోట్లు, దీర్ఘకాలిక 300 కోట్లు, మహి ళా సంఘాలకు 150 కోట్లు, విద్య కోసం 100 కోట్లు, గృహ రుణాలు 200 కోట్లు, ఇతర రుణా లు 1,550 కోట్ల చొప్పున మొత్తం 3,800 కోట్లు ఇచ్చేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని రవీందర్రావు వివరించారు. ఈ యేడా ది పంట రుణాలతోపాటు దీర్ఘకాలిక రుణాలు తెలంగాణలో 500 కోట్లు దాటిన సందర్భం ఎన్నడూ లేదని, ఈసారి వెయ్యి కోట్లు దాటిందన్నారు. ఇందులో ఒక్క కేడీసీసీబీ ద్వారానే 273.02 కోట్లు ఇచ్చామని చెప్పారు.
కర్షక మిత్ర పేరిట రుణాలు
కొన్ని జిల్లాల్లో కర్షక మిత్ర పేరుతో రుణాలు అందిస్తున్నామని, ఈ విధానం ఇంకా కరీంనగర్కు రాలేదని కొండూరు తెలిపారు. ఈ రకంగా రైతుల అవసరాలకు అనుగుణంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వి ద్యా రుణాలు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నామని, క్రమంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.
ఈసారి బ్యాం కు గ్రాస్ ఎన్పీఏ కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుందని, బ్యాంక్ ద్వారా పొందిన అప్పుల ను రైతులు, ఖాతాదారులు పూర్తిగా సద్వినియో గం చేసుకుని బాగుపడుతున్న నేపథ్యంలో తిరిగి అప్పులు చెల్లిస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టం గా తెలుస్తున్నదని చెప్పారు. సీఈవో సత్యనారాయణరావు నేతృత్వంలో క్రమ శిక్షణగా, కిమిట్మెంట్తో పనిచేస్తున్న జీఎంలు, డీజీఎంలు, ఏడీఎంలు, ఇతర అధికారులు, సిబ్బంది 550 మం దిని, రికవరీకి కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. సమావేశంలో సీఈవో సత్యనారాయణరావు, కేడీసీసీబీ ఉపాధ్యక్షులు పింగలి రమేశ్, డైరెక్టర్లు ఉచ్చిడి మోహన్రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాబార్డ్ డీడీఎం అనంత్, చార్టెడ్ అకౌంటెంట్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.