జగిత్యాల టౌన్, జూన్ 30 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఏ సమస్య వచ్చి నా.. అండగా ఉంటామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. జిల్లా కేం ద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, రాజేశం గౌడ్తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఫలితాల దృష్ట్యా కార్యకర్తలకు మనోైస్థెర్యం ఇవ్వడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు. పార్టీ సముద్రం లాంటిదని.. అధికారం బీఆర్ఎస్ పోగానే కొందరు నా యకులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారనని తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తామని, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 14ఏండ్లు ఎన్నో అటుపోట్లు చూసిందని.. పదేండ్లు అధికారంలో ఉందని.. జగిత్యాల ఎమ్మెల్యే పోయినంతా మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నా రు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, సమావేశానికి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అల్లాల దామోదర్రా వు, వొళ్లెం మల్లేశం, గంగారెడ్డి పాల్గొన్నారు.