‘డ్రగ్స్ను తరిమేద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువతీ యవకులు, విద్యార్థులు నినదించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం అంతటా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు తీశారు.
ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించి, కలెక్టర్లు, జిల్లా అధికారులు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా కావొద్దని, ఉజ్వల భవిష్యత్ను పాడు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామంటూ ప్రతిజ్ఞలు చేయించారు.
– తిమ్మాపూర్/ జగిత్యాల కలెక్టరేట్