తిమ్మాపూర్/కార్పొరేషన్, జూలై 1: బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు జిల్లాలో నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం జగిత్యాల జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న ఆయనకు ముందుగా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకగా, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి కేటీఆర్ ఫొటోలతో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.
అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ కేటీఆర్ను గజమాలతో సత్కరించి, స్వాగతం పలికారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు కేటీఆర్ను శాలువాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి కేటీఆర్ పాటు జిల్లా బీఆర్ఎస్ నాయకులు సైతం జగిత్యాలకు తరలివెళ్లారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్సింగ్, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, కార్పొరేటర్లు సల్ల శారదారవీందర్, వాల రమణారావు, ఐలేందర్, గందె మాధవి, పోరండ్ల సొసైటీ చైర్మన్ స్వామి రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.