ఇస్లామాబాద్: రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. (Pranksters Splash Water On Train ) రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్లో ఈ సంఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలో ఉన్న కాలువ వద్ద కొందరు యువకులు ఫ్రాంక్ కోసం ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించిన వారు బైక్ ద్వారా నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చేష్టలకు సంబరపడ్డారు.
కాగా, రైలు ఇంజిన్పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. సిబ్బందితో పాటు ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు రైలు దిగారు. బైక్ ద్వారా రైలుపై నీటిని చిమ్మిన ఆకతాయిలు వారిని చూసి షాకయ్యారు. తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే కొందరు ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు. వారిని పట్టుకొని కొట్టారు.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. యువకులు రైలుపై నీటిని చిమ్మిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ان لوگوں کو لگ رھا تھا ٹرین رکے گی نہیں،ٹرین رکی،مسافروں نے طبیعت صاف کرکے ان کو دھویا اور پولیس نے بائیک بھی ضبط کرلی۔لیکن ان ذلیل لوگوں کو گرفتار کیا جانا چاھئے تھا۔ pic.twitter.com/sGCbbjugVL
— صحرانورد (@Aadiiroy2) June 25, 2024