Memes : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు, టెక్ దిగ్గజం నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఇక నారాయణ మూర్తిని ఉటంకిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ జాతర కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా భారత్ దీటైన పోటీ ఇవ్వాలంటే మన యువత వారానికి 70 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని గత ఏడాది అక్టోబర్లో నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆన్లైన్ వేదికగా హాట్ డిబేట్ సాగింది. మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన సలహాను అల్లుడు రిషీ సునాక్ పాటించలేదా అంటూ మీమ్స్తో సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు. రిషి సునాక్ వారానికి 70 గంటలు పనిచేయలేదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
బ్రిటన్ ప్రధానిగా రిషీ సునాక్ మాజీ కాబోతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్ధితి ఎదురైందని ఓ యూజర్ రిషీ ఫొటోతో మీమ్ క్రియేట్ చేశారు. ఇక ఇదే తీరులో పలువురు యూజర్లు నారాయణ మూర్తి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, బ్రిటన్ పార్లమెంట్కు గురువారం జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.
శుక్రవారం ఎన్నికల ఫలితాల్లో 400 సీట్లకు పైగా గెలుచుకున్నది. దీంతో లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్.. తదుపరి బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. కీర్ స్టార్మర్ నియామకానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడగానే కీర్ స్టార్మర్.. బకింగ్ హం ప్యాలెస్లో రాజు కింగ్ చార్లెస్-3ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కీర్ స్టార్మర్ను రాజు కింగ్ చార్లెస్-3 ఆహ్వానించారు.
Read More :