Indian Student | పెన్సిల్వేనియా: స్కాలర్షిప్ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 19 ఏండ్ల ఆర్యన్ ఆనంద్ గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లతో లేహీ వర్సిటీలో ప్రవేశం పొందాడు.
స్కాలర్ షిప్ కోసం తన తండ్రి బతికి ఉన్నప్పటికీ మరణించినట్టు డెత్ సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వర్సిటీలో ఎలా సీటు తెచ్చుకుంది.. తన తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి స్కాలర్షిప్ తెచ్చుకున్న వైనాలన్నీ వివరిస్తూ ‘అబద్ధాలతోనే నా జీవితం, కెరీర్ను నిర్మించుకున్నా’ పేరుతో రెడ్డిట్లో అతడు చేసిన పోస్టే అతడిని పట్టించింది. దీంతో ఏప్రిల్ 30న ఆనంద్ను అరెస్ట్ చేశారు. అతనిపై ఆరోపణలకు జీవితకాల శిక్ష పడుతుంది. అయితే అతడు నార్తంప్టన్ కౌంటీ జైలులో ఒకట్రెండు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టి స్వదేశానికి పంపనున్నారు.
కొలంబో, జూన్ 28: సైబర్ నేరాలతోపాటు అక్రమ బెట్టింగ్లు, జూదం నిర్వహిస్తున్న ముఠాలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తూ 137 మంది భారతీయలను శ్రీలంక సీఐడీ విభాగం గురువారం అరెస్ట్ చేసింది. కొలంబో సబర్బన్ ప్రాంతాలైన మడివెల, బట్టరముల్లతో పాటు పశ్చిమ కోస్తా పట్టణం నెగెంబోపై సీఐడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేయగా, అందులో 137 మంది భారతీయలు ఉన్నారు. వీరి నుంచి 135 మొబైల్ ఫోన్లు, 57 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.