అంకారా: ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు 21 వేల మందికిపైగా మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపాల వంటి విపత్తులు జరిగినప్పుడు అత్యంత కీలకమైన 72 గంటల సమయం ఇప్పటికే ముగిసిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కున్నవారు బతకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, టర్కీలో గడ్డకట్టే చలి, సిరియాలో అంతర్యుద్ధం కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నది. భూకంపం దాటికి ధ్వంసమైన రోడ్లు, రన్వేల వల్ల కూడా ప్రజలకు వేగంగా సహాయం అందడం లేదు.
భూకంపంతో కూలిన భవనాల శిథిలాల కింద ఉన్న వారిని తొలగించేందుకు రెస్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు తుర్కియే అధికారులు చెప్తున్నారు. అయితే, తమ వారిని కాపాడుకునేందుకు ప్రజలు కూడా బృందాలుగా ఏర్పడి శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమని కాపాడాలని చేస్తున్న ఆక్రందనలు విని భరించలేకపోతున్న ప్రజలు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
కాగా, భూకంపంతో భారీ నష్టాన్ని చవిచూసిన తుర్కియే, సిరియాలకు అమెరికా, ప్రపంచ బ్యాంక్ ఆర్థికసాయం ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా రూ.700 కోట్లు, ప్రపంచ బ్యాంకు రూ.1.46 లక్షల కోట్ల సాయాన్ని అందించనున్నాయి.
రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపానికి తుర్కియే దేశమే కదిలిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సిరియాతో పోల్చితే తుర్కియే ఐదారు మీటర్ల మేర కదిలిపోయిందని పేర్కొన్నారు. తుర్కియే ఉన్న భూమి పైపొరల్లోని పలకల రాపిడి కారణంగా ఇది జరిగిందని అంచనా వేస్తున్నారు.
VIDEO: Ukrainian rescuers arrive in Turkey.
Rescuers from the Ukrainian emergency services set up a "tent city" in the city of Antakya, Turkey, to begin search and rescue operations after the deadly earthquake that claimed thousands of victims in the region pic.twitter.com/eiGET8Q269
— AFP News Agency (@AFP) February 10, 2023