BRICS Leaders : ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్ దేశాధినేతలు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన వీరు.. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను క్రిమినల్, సహేతుకంకాని నేరంగా పరిగణించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రకటన చేశారు.
భారత్ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశంలో ఉగ్రవాదంపై పిడికిలి బిగించారు నేతలు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ నాయకులు.. అన్ని రకాల టెర్రరిజంపై పోరాటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 140 పాయింట్లతో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేసిన వీరు.. ఉగ్రవాదాన్ని క్రిమినల్, న్యాయసమ్మతం కాని చర్యగా పరిగణించాలని తీర్మానించారు.
🚨 DELHI DECLARATION
BRICS calls for zero tolerance on terrorism, rejects double standards, and backs action against terrorists in all forms, including cross-border terrorism – a clear message to Pakistan
BRICS condemns last year’s Pahalgam terror attack.
BRICS calls for… pic.twitter.com/Ds6ZsqtLb1
— News Algebra (@NewsAlgebraIND) September 12, 2026
‘జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం. ఈ ఘటనలో 26 మంది చనిపోగా.. చాలామంది గాయపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలపై, సీమాతంర ఉగ్రవాదంపై, టెర్రరిస్టులకు ఆర్ధిక సాయం చేస్తున్నవారిపై, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. టెర్రరిజంపై ఎవరూ ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు’ అని బ్రిక్స్ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
PTI INFOGRAPHICS | Key highlights from the BRICS New Delhi Declaration 2026 (n/5)#BRICSUpdatesOnPTI #BRICS2026 #BRICS #BRICSSummit #BRICSIndia #PTIInfographics pic.twitter.com/FFKUna8QrC
— Press Trust of India (@PTI_News) September 12, 2026
న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రకారం.. తీవ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని అణచివేయడం.. ముఖ్యంగా యువత అటువైపు ఆకర్షితలవ్వకుండా చూడడం చాలా ముఖ్యం. ఈ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. అంతేకాదు తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ఉత్తమ విధానాలను పంచుకోవాల్సి ఉంది అని తీర్మానంలో బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు.