హైదరాబాద్: కృత్రిమే మేధ.. మానవాళిని అంతం చేయనున్నట్లు ఏఐ పరిశోధకుడు జాకబ్ కోక్సన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎటువంటి రక్షణ పరిమితులు లేకుండానే సూపర్హ్యూమన్లు ల్యాబ్ల్లో తయారు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. ఆ సూపర్హ్యూమన్తో మానవాళి అంతం అవుతుందని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను ఏఐ రీసర్చర్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు చెప్పాడు. ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీలో జాకబ్ కీలక హోదాలో పనిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై వర్క్ చేస్తున్న వారంతా భయపడుతున్నారని, ఈ దశాబ్ధం చివరకల్లా మానవాళికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఏఐ నిపుణులు భావిస్తున్నారని జాకబ్ తెలిపాడు.
గత మూడేళ్ల నుంచి ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్లో జాకబ్ పనిచేశాడు. తన కంపెనీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, సూపర్ ఇంటెలిజెన్స్ కోసం పరుగులు తీస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటారని అతను పేర్కొన్నాడు. ఏఐ శక్తిని తక్కువ అంచనా వేయవద్దు అని అతను వార్నింగ్ ఇచ్చాడు. త్వరలో సూపర్హ్యూమన్ సిస్టమ్స్ వస్తాయని, అది దేన్నైనా హ్యాకింగ్ చేస్తుందని, రాత్రికి రాత్రి ఏ రంగాన్నైనా ధ్వంసం చేస్తుందని, నిజమైన శక్తులను ఆ సిస్టమ్స్ పొందుతాయని తన వార్నింగ్లో జాకబ్ పేర్కొన్నాడు.
తమ పరిశోధనల్లో ఆ ప్రగతిని చూశామని కూడా అతను చెప్పాడు. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ మధ్య జరుగుతున్న ఏఐ వార్.. మానవాళికి ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయన్నాడు. కొన్ని రోజుల క్రితమే యూఎన్ రైట్స్ చీఫ్ వోల్కర్ టుర్క్ తన వార్నింగ్లో ఏఐ ప్రమాదం గురించి పేర్కొన్నాడు. ఏఐ వల్ల మానవాళికి ప్రమాదం ఉందని వోల్కర్ హెచ్చరిక జారీ చేసిన కొన్ని రోజుల్లోనే జాకబ్ అదే తరహా వార్నింగ్ ఇవ్వడం ఆందోళనకరంగా మారింది. అడ్వాన్స్డ్ ఏఐ వల్ల మానవాళి మనుగడ ప్రమాదంగా మారుతుందన్నారు. మెటా, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, గూగుల్ సంస్థలు ప్రస్తుతం ఏఐ లీడింగ్ కంపెనీల జాబితాలో ఉన్నాయి.
The people building AI earnestly believe that it could kill us all by the end of the decade. This is not a marketing stunt. If anything, many executives and senior researchers will couch their phrasing in the press to sound sensible – but I hear the same people express fear…
— Jacob Coxon (@hilbertspaess) September 9, 2026