World War II Bomb | జర్మనీ (Germany) లోని డ్యూసెల్డార్ఫ్ (Dusseldorf ) ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు (World War II Bomb) కలకలం రేపింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ (City Zoo) సమీపంలో అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పేలుడు పదార్థాన్ని గుర్తించిన 500 మీటర్ల పరిధిలోని ప్రజలను హుటాహుటిన అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్ను రంగంలోకి దించి బాంబును డిస్పోజ్ చేసే ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆగస్టు 7 – 8 తేదీల్లో ఈ బాంబును గుర్తించినట్లు జర్మన్ వార్తా సంస్థ డ్యుయిష్ వెల్లే (Deutsche Welle) తెలిపింది. మరోవైపు బాంబు గుర్తింపుతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతం నుంచి 13,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
రెండో ప్రపంచ యుద్ధం నాటి వేలాది బాంబులు ఇప్పటికీ జర్మనీలో అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. 2017లో ఫ్రాంక్ఫర్ట్ ( Frankfurt)లో 1.4 టన్నుల బరువున్న బాంబు బయటపడింది. అప్పుడు ఆ ప్రాంతం నుంచి సుమారు 65,000 మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. 2021 డిసెంబర్లో కూడా మునిచ్ స్టేషన్ (Munich station) సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండో ప్రపంచ యుద్ధం బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
జర్మన్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. 1940 – 1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్, బ్రిటిష్ వైమానిక దళాలు 2.7 మిలియన్ టన్నుల బాంబులను యూరప్పై జారవిడిచాయి. అందులో సగం జర్మనీపై పడేశాయి. ఈ దెబ్బకి 1945 మేలో జర్మనీలోని నాజీ ప్రభుత్వం (Nazi government) సరెండర్ అయ్యే సమయానికి ఆ దేశంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మొత్తం నాశనమయ్యాయి. నగరాలు బూడిదగా మారాయి.
Also Read..
America | అమెరికాను వణికిస్తున్న భీకర తుపాను.. వేల విమానాలు రద్దు
Alia Bhatt | హాలీవుడ్ నటికి తెలుగు నేర్పించిన అలియా భట్.. వీడియో వైరల్
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు