Outsourcing Employees | సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ ) : ఎస్ఆర్ నగర్ ఎల్లారెడ్డి సెక్షన్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే చంద్రశేఖర్కు ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో కాలు, చేతి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఈఎస్ఐలో చేర్పిస్తే సకాలంలో వై ద్యం అందలేదు..కారణం ఈఎస్ఐ చెల్లింపులు సక్రమంగా లేకపోవడమే. మానవతా దృ క్పథంతో తక్షణమే యూనియన్ ప్రతినిధులు, సంబంధిత డివిజన్ ముఖ్య అధికారులు స్పం దించి వైద్య సహాయం అందించారు. ఈ ఘట న నేపథ్యంలో కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సకాలంలో చెల్లించడం లేదంటూ సంబంధిత సుమతి ఏజెన్సీపై జల మండలి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నారాయణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో ఖైరతాబాద్ కేంద్రంగా పనిచేసిన ఓ ఏజెన్సీ దాదాపు 300 మంది కార్మికులకు 10 నెలలకు పైబడి పీఎఫ్ చెల్లించకుండానే జెండా ఎత్తేసింది. చర్యలు తీసుకోవాల్సిన జల మండలి.. ఏజెన్సీ పక్షాన నిలబడటంతో కార్మికులు తీవ్రంగా నష్ట పోయారు.
ఇక్కడ ఈ ఏజెన్సీలే కాదు జల మండలి పరిధిలో ఉన్న చాలా ఏజెన్సీలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. బోర్డు నుంచి నిధులు తీసుకుంటూ సకాలంలో వారికి జీతా లు చెల్లించడం లేదు. మరోవైపు వేతనాల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదు. వాస్తవంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే ప్రతి కార్మికుడికి ఏజెన్సీ సకాలంలో వేతనం ఇవ్వడమే కాదు.. ఈఎస్ఐ కా ర్డులు అందించాలి. ఆ తర్వాత పీఎఫ్కు సం బంధించి కార్మికుడి ఫోన్ నంబరుకు ఈపీఎఫ్ చెల్లింపునకు సంబంధించిన పేమెంట్ (వివరాలు) అందేలా చూడాలి. ప్రతి కార్మికుడి ఈ పీఎఫ్ తాలుకా నంబరు వివరాలను సంస్థకు అందజేయాలి. కానీ చాలా ఏజెన్సీలు కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో పారదర్శకత పాటించడం లేదు. కాసులకు కక్కుర్తిపడే కొందరు అధికారుల అండదండలతో కార్మికు ల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. సిబ్బంది, సం స్థ ఖజానాకు కన్నం పెడుతున్నది. జాబితాల్లో ఎక్కువ మంది చూపి, క్షేత్రస్థాయిలో అంతకం టే తక్కువ మందితో పనిచేస్తున్నాయి. వేతనాల విషయంలో మాత్రం వీరందరి పేరుతో వసూలు చేస్తున్నారు. ఫలితంగా మండలి ఆదాయానికి భారీగా గండిపడుతుందన్న ఆరోపణలు లేకపోలేదు.
జలమండలి పరిధిలో 3,800 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే ఔట్సోర్సింగ్లో దాదాపు 4,500 మంది పనిచేస్తున్నారు. సుమారు 8 ఏజెన్సీల నిర్వహణలో కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఆపరేటర్లు, లైన్మెన్లు, లిఫ్ట్ బాయ్లు, క్లర్క్లు, సెక్యూరిటీ గార్డులు, కార్యాలయ సహాయకులు పనిచేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా డివిజన్ల పరిధిలో ఔట్సోర్సింగ్ కార్మికుల నెలవారీగా అటెండెన్స్ను డివిజన్ -9కు పంపించి అక్కడి నుంచి ఏజెన్సీలకు నెలవారీ చెల్లింపులు జరుగుతున్నాయి. బోర్డు నుంచి తీసుకున్న నిధులను సంబంధిత కార్మికులకు ఏజెన్సీలు నెలజీతం చెల్లిస్తున్నాయి. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమాలకు తెర లేపాయి. కొన్ని ఏజెన్సీలు సిబ్బంది లెక్కలను తారుమారు చేయడం, పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ములు చెల్లించకపోవడం, తక్కువ మందితో పనిచేయించి జలమండలి నుంచి ఎక్కువ నిధులు రాబట్టడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి.
అధికారులు మాత్రం ఏజెన్సీలు కార్మికులకు సకాలంలో ఈపీఎఫ్ చెల్లిస్తున్నాయా? లేదా? ఈఎస్ఐ కార్డులు ఇస్తున్నారా? అన్నది ప్రత్యేక వ్యవస్థతో తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప తరచూ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాట దాటవేస్తుండటం అధికారులకే చెల్లింది. ఉన్నతాధికారులు కార్మికుల పక్షాన నిలబడి ఏళ్ల తరబడి కొందరు ఉన్నతాధికారుల బంధువులు, యూనియన్ సంఘాల నేతలకు సంబంధించిన ఏజెన్సీలపై ఉక్కుపాదం మోపాలని కార్మికులు కోరుతున్నారు. శివారులో తాగు, సీవరేజీ విభాగంతో పాటు డివిజన్ 1, 2, 3, గోదావరి, కృష్ణా పథకంలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల లెక్కలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని కార్మికులు పేర్కొంటున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఏజెన్సీకి చెందిన వ్యక్తి బాధితుడి ఈపీఎఫ్ వివరాలను స్లిప్పై రాసిచ్చే విధానానికి స్వస్తి పలికి, ప్రతి కార్మికుడికి నెలవారీగా ఎంత పీఎఫ్ అమౌంట్ డిపాజిట్ జరిగిందో ఎస్ఎంఎస్ విధానంలో తెలుసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.