హిమాయత్నగర్, ఫిబ్రవరి 20: చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కోఠి ఇసామియా బజార్కు చెందిన ఓ చిన్నారి(6) బషీర్బాగ్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి చదువుకుంటుంది. హిమాయత్నగర్ వీధి నం1లో ఉండే ఏ.సురేశ్(41) ఆటో డ్రైవర్. అదే స్కూల్కు పిల్లలను ఆటోలో తీసుకెళ్తూ, చిన్నారిని భయపెట్టాడు.
ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి సురేశ్ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మంగళవారం సురేశ్ను నాంపల్లికోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి సత్యనారాయణ అతనికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.