పట్నా: బీహార్లో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ఈ ఆందోళనలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్య, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చాలని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. దాంతో పట్నాలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.