హైదరాబాద్ : మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను(Talasani Srinivas yadav) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy )పరామర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్(Shankar yadav) ఈ నెల 10 వ తేదీన మరణించారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం వెస్ట్ మారేడ్పల్లి రాధికా కాలనీలోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఆయన శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు(Tribute) అర్పించిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు వారి మాతృమూర్తి లలితా బాయి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.