కుత్బుల్లాపూర్, జూన్ 30 : ఏపీ, రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 కిలోల గంజాయితోపాటు రూ.50వేల నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పేట్ బషీరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఎస్ఓటీ సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్లు వివరాలు వెల్లడించారు. ఏపీ, ఏలూరుకు చెందిన గేదెల సతీశ్, గన్నవరంకు చెందిన కోరాడ సాయికుమార్, బండారు శివకుమార్లు ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న ఎండు గంజాయిని ఏపీ, రాజమహేంద్రవరం నుంచి ఓఆర్ఆర్ మీదుగా నగరానికి తీసుకొస్తున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ టీంతో పాటు శామీర్పేట్ పోలీసులు ఈ నెల 28న శామీర్పేట్లోని ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద బొలెరో వాహనాన్ని తనిఖీ చేయ గా.. 33 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని..గంజాయిని స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన ఎస్ఓటీ టీంతో పాటు శామీర్పేట్ పోలీసులను డీసీపీలు అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శోభన్కుమార్, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, శామీర్పేట్ సీఐ శ్రీనాథ్తో పాటు ఎస్ఓటీ టీం, శామీర్పేట్ పోలీసులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గంజాయి రవాణా చేస్తు న్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి వద్ద నుంచి 31.2కిలోల గంజాయి, సెల్ఫోన్తో పాటు మారుతీ 800కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బోయినిపల్లి సురేశ్ సులభంగా డబ్బు సంపాదించడం కో సం గంజాయి రవాణా చేస్తున్నాడు. గంజాయి ప్యాకెట్లను ప్రత్యేకంగా తయారు చేసిన గ్యాస్ ట్యాంక్లో పెట్టి తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం నాగోల్ ఠాణా పరిధిలో అతడిని తనిఖీ చేయగా.. రూ.8.5లక్షల విలువ చేసే 31.2కిలోల గంజాయి లభించింది. వెంటనే అతడిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.