సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 40 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ కె.శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ బదిలీల్లో భాగంగా లూప్లైన్లో ఉన్న పలువురికి ఎస్హెచ్ఓలుగా పోస్టింగ్ కల్పించారు. 14 మందిని మల్టీజోన్కు అటాచ్ చేయగా మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేశారు.