Rain Update | సిటీబ్యూరో: రుతుపవనాల ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 9.30 గంటల వరకు హయత్నగర్లో 3.18, కాంచన్బాగ్లో 1.95, హస్తినాపురంలో 1.93, వనస్థలిపురం, చార్మినార్ ప్రాంతాల్లో 1.70, ఉప్పల్, బండ్లగూడ, పాతబస్తీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో చురుకుగా కదులుతున్న రుతుపవనాల ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.