బడంగ్పేట, జూన్ 30: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 24వ డివిజన్లో ఉన్న గ్రీన్ జోన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అల్మాస్గూడలోని 24వ డివిజన్లో ఉన్న విశాఖనగర్, శ్రీసాయి హోమ్స్, వెంకటేశ్వర కాలనీ, ఎస్ఆర్ హిల్స్, ఏఆర్ఎసీఆర్ కాలనీ అసోసియేషన్ నాయకులు గ్రీన్ జోన్ నుంచి తమ కాలనీలను రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సర్వే నం. 122, 123, 124, 129లో ఉన్న గ్రీన్ జోన్ ఎత్తివేస్తే కాలనీ వాసులు ప్రశాంతంగా ఉంటారని ఎమ్మెల్యేకు వివరించారు. ఇంటి నిర్మాణానికి అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ జోన్ పరిధి ఉందన్నారు. ఒక అల్మాస్గూడలోనే ఆరు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటి అనుమతులు ఇవ్వక పోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడం లేదన్నారు.
ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే నెలకు అదనంగా 11 వేలు చెల్లించవలసి వస్తుందని ఎమ్మెల్యేకు తెలిపారు. అందుకు గాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఎన్నికలలో ఇచ్చిన హమీని తప్పకుండా అమలు చేయించే బాధ్యత తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. గతంలోనే ఈ సమస్య పరిష్కారం కావలసి ఉందన్నారు. చిన్న చిన్న సమస్యల వలన పెండింగ్ అయ్యిందన్నారు. దీంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్న అంశం తన దృష్టిలోకి వచ్చిందన్నారు. బడంగ్పేట, అల్మాస్గూడలో ఉన్న ఈ సమస్యను అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుక పోయి పరిష్కరిస్తానని కాలనీవాసులకు అభయం ఇచ్చారు. కాలనీలలో మౌలిక సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నవారు మల్లారెడ్డి, గ్రీన్ జోన్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్, మాధవరెడ్డి, కమిటీ సభ్యులు ఉన్నారు.