Nagarjuna | అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్టే ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మాదాపూర్లోని N కన్వెన్షన్ సెంటర్ను అక్రమ కట్టడమని పేర్కొంటూ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున సీరియస్ అయ్యారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ఒకవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా అర్ధాంతరంగా కూల్చివేయడం సరికాదని అన్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని చెప్పిన ఆయన.. ఈ కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ట్విట్టర్ వేదికగా చెప్పారు. అన్నట్టుగా శనివారం హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ నాగార్జున తరుపున న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.వినోద్కుమార్ విచారణ చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పటికే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేశారు.
Akkineni Nagarjuna | ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున