సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా ఏవీ రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చినప్పటి నుంచి నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త రోడ్లపై పేరుకుపోతున్నది. దీంతో ‘నమస్తే’ బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ..కథనాలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం..పలు ప్రాంతాల్లో వ్యర్థాలు వేసే చోట.. బల్దియా ఉద్యోగులను నియమించింది. వ్యర్థాలు వేస్తే రూ. 1000 జరిమానా విధిస్తామంటూ..బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. యూసుఫ్గూడ కల్యాణ్నగర్లోని దృశ్యమిది.