సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ప్రజావాణి సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుందని చెప్పారు. ప్రజలు 040-2322 2182 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించాలని పేర్కొన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తారని కమిషనర్ స్పష్టం చేశారు.