హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వే (PV Express Way) వద్ద ఓ కారు బిభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ వైడర్ను ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు.. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేశ్ అనే యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అతికష్టంపై ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా, ప్రమాదానికి మితిమీరిన వేగమా?.. మద్యం మత్తులో కారును నడిపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు.. రేసింగ్లో పాల్గొని ఇలా వేగంగా దూసుకువచ్చినట్లు తెలుస్తున్నది.