Gruha Jyothi | ‘మాది ఒక్కటే ఫ్లోర్.. కొందరికి జీరో బిల్లు వచ్చింది.. మాకెందుకు రాలేదం’టూ…వంద సంఖ్యలో లబ్ధిదారులు సోమవారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధి కార్యాలయాలకు చేరుకొని అధికారులను నిలదీశారు. ఏకకాలంలో లబ్ధిదారులంతా కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో అధికారులు వారికి సమాధానం చెప్పలేక అయోమయానికి గురయ్యారు.
చివరకు ఉపకమిషనర్ నర్సింహ స్పందించి.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు వెనుదిరిగారు.
– కుత్బుల్లాపూర్, మార్చి 4