Congress Govt | కందుకూరు, జూలై 3: రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రాయితీపై సిలిండర్ అందజేయాలని గ్యాస్ ఏజెన్సీలకు సైతం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్హులైన వారు ఏజెన్సీల నుంచి సిలిండర్లు పొందుతున్నారు. అయితే, చాలా మంది గ్యాస్ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్లో మహాలక్ష్మి పథకం రాయితీ జమ కావడంలేదని వాపోతున్నారు. లబ్ధిదారులు ప్రతిరోజూ గ్యాస్ ఏజెన్సీలు, గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు జమ కాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకే హామీ ఇచ్చినట్లు ఉన్నది. ఏడు నెలలు గడుస్తున్నా.. హామీ నెరవేరడం లేదు. రూ.500 రాయితీ వస్తదని లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. రాయితీ డబ్బులు ఖాతాల్లో జమ కావడంలేదు. వారి ఆశలను వమ్ము చేస్తున్నారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. లబ్ధిదారులు ప్రతి రోజూ గ్యాస్ ఏజెన్సీలు, మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నికల జరిగి ఏడు నెలలు కావస్తున్నా.. పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాడుతాం.
గ్రామాల్లో ఎవరికీ మహాలక్ష్మి పథకం కింద రూ.500 సబ్సిడీ రావడం లేదు. సీఎం రేవంత్రెడ్డి ఆచరణలో అమలు కానీ హామీలను ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ కాకపోవడంతో అబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి.