హైదరాబాద్ : ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతాననీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు, పరస్వతినగర్ కాలనీ, కాస్మోపాలిటీన్ కాలనీలలో స్థానిక నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి(Pedda cheruvu) డ్రైనేజీ మురుగు నీరు కలుస్తుందని స్థానికలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
చెరువు కలుషితం కావడంతో తీవ్ర దురువాసనతో అటుగా వెళ్లలేక పోతున్నామని తెలిపారు. చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టాలని, ఇదే విధంగా సరస్వతినగర్ కాలనీలో డ్రైనేజీ విస్తరణ పనులు, కమ్యూనిటీ హాల్ పై అదనపు అంతస్తు నిర్మాణం, కాస్మోపాలిటీన్ కాలనీలలో డ్రైనేజీ విస్తరణ పనులు, కాలనీలోని పార్కు గోడ ఎత్తును పెంచే విధంగా చూడాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మన్సూరాబాద్ పెద్ద చెరువు మురుగు నీటితో కలుషితం కాకుండా చూడటంతో పాటు చెరువును సుదరీకరించి పర్యాట కేంద్రంగా(Tourist spot) తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ చెరువుతో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. త్వరలో ఆయా కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ విస్తరణ పనులు, కమ్యూనిటీ హాల్ పై అంతస్తు భవనం, పార్కు గోడ ఎత్తును పెంచే పనులను దశల వారిగా పూర్తి చేసేట్లు చర్యలు చేపడతాననీ ఎమ్మెల్యే ఆయా కాలనీ వాసులకు భరోసానిచ్చారు.