హైదరాబాద్ : నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురం ఓవర్ బ్రిడ్జితో(Flyover bridge) ప్రతిరోజు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. బుధవారం రైల్వే అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మరమ్మతులు, ఫ్లైఓవరు ఆనుకొని సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఆర్కేపురం చెరువును పరశీలించారు.
చెరువులో పేరుకపోయిన మురికినీరు దుర్వాసన, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి ఏడీఈఎన్ సుధాకర్, జీహెచ్ఎంసీ ఈఈ రాజు, డీఈ రేణుక, స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, మేకల రాముయాదవ్, జీకే హన్మంతరావు, ఉపేంద ర్రెడ్డి, చిందం శ్రీనివాస్, శోభారాణి, రమాదేవి, శ్యామ్, శంకర్రావు, పాపిరెడ్డి, సర్వేష్ యాదవ్, శివ, బాలకృష్ణ, నరేష్, రాజేష్, రవీంద్ర, నవీన్, వడ్డెరరాజు తదితరులు పాల్గొన్నారు.