కేపీహెచ్బీ కాలనీ : యువత క్రీడలు(Sports,), వ్యాయామంపై దృష్టిసారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. సోమవారం కూకట్పల్లి బాలకృష్ణనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వి1స్పోర్ట్స్ అండ్ కేఫ్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనా రాయణరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నేటితరం యువత సెల్ఫోన్కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా మాయలోపడి విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దని హితవు పలికారు. క్రీడలలో నైపుణ్యాలను పెంపొందించుకుని రాష్ర్టానికి, దేశానికి సేవలందించాలన్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు దేహ ధారుడ్యం మెరుగవుతుందన్నారు. గత ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో దేవానంద్, వెంకటేష్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, అంబాటి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.