హైదరాబాద్ : నిర్లక్ష్యం వీడి ఓల్డ్బోయిన్పల్లి(Old boinapalli) డివిజన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని వివిధ విభాగాల అధికారులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao )మందలించారు. సోమవారం ఓల్డ్ఓయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్తో కలిసి డివిజన్లో పరిధిలోని మానసస రోవర్ హైట్స్ నాలా, బోయిన్ చెరువును సందర్శించారు. అనంతరం డివిజన్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో బస్తీవాసులు, కాలనీవాసుల విజ్ఞప్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికారులు పూర్తి చేయకపోవడం విచారకరం అన్నారు.
చేపట్టిన పనులు పూర్తి చేయకుండా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు. హస్మత్పేట చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడం వలన స్థానిక ప్రజలకు దోమల బెడద అధికమైందని తక్షణమే చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బోయిన్చెరువు కట్టను సుందరీకరణ చేసి మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దాలన్నారు.
ఎస్సీ బస్తీలో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ గోవర్ధన్గౌడ్, డీఈ బాలకృష్ణ, ఏఈ అరవింద్రావు, జలమండలి అధికారి షంషేర్, టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్ సోమేశ్, నీటిపారుదలశాఖ ఏఈ లక్ష్మీనారాయణ, విద్యుత్శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.