హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో(Jubilee Hills) భారీ అగ్నిప్రమాదం(Massive fire) చోటు చేసుకుంది. జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోని(Software company ) నాలుగో అంతస్తులో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు (Software employees) భయంతో పరుగులు తీశారు.
వెంటనే అగ్నిమాక సిబ్బందికి సమాచారమందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్సేప్టీ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బి ల్డింగ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్ను డంపింగ్ (wastage) కోసం వాడటం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్త కూడా చదవండి..
తమిళనాడు గవర్నర్ను కలిసిన ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం
తమిళనాడులోని కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యవహరంపై డీఎంకే సర్కార్, సీఎం ఎంకే స్టాలిన్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కళ్లకురిచి ఘటనకు సంబంధించి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ఆ పార్టీ నేతలు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని రాజ్భవన్లో మంగళవారం కలిశారు.
గవర్నర్తో భేటీ అనంతరం పళనిస్వామి విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగుచూసేందుకు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
అటవీ శాఖ అధికారులను కూడా విచారించాలని అన్నారు. సీబీసీఐడీ విచారణతో ఈ కేసులో వాస్తవాలు బయటపడవని చెప్పారు. ఏకసభ్య కమిషన్ విచారణతో కూడా ఎలాంటి ఉపయోగం లేదని పెదవివిరిచారు. కళ్లకురిచి కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్కు తాము వినతిపత్రం సమర్పించామని పళనిస్వామి వెల్లడించారు.