సిటీబ్యూరో : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9గంటల వరకు అడ్డగుట్టలో 1.28 సెం.మీలు, మల్కాజిగిరి ఆనంద్బాగ్లో 1.28 , వినాయక్నగర్, మల్లాపూర్, మౌలాలి, వెస్ట్ మారేడ్పల్లి, పికెట్ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 30.8, కనిష్ఠం 23.5 డిగ్రీలు, గాలిలో తేమ 60శాతంగా నమోదైనట్లు అధికారులు వివరించారు.