సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనున్నది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. శనివారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం (కౌన్సిల్) ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.