కబ్జాకు కాదేది అనర్హం… అన్నట్లు కొందరు ఏకంగా శ్మశానంలోనే కబ్జా చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బీ బ్లాక్లో హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన 1.5 ఎకరాల స్థలంలోని 500 గజాల్లో రాత్రికి రాత్రే రేకుల షెడ్ను నిర్మించారు. దీంతో కబ్జాను అడ్డుకునేందుకు స్థానికులు ఎమ్మెల్యే గాంధీ, మియాపూర్ పోలీసులు, శేరిలింగంపల్లి సర్కిల్ -20 అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.